బేగంబజార్‌లో కార్డన్ సెర్చ్..

3 Nov, 2015 20:37 IST|Sakshi

హైదరాబాద్: బేగంబజార్ ప్రాంతంలో పోలీసులు మంగళవారం సాయంత్రం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీసీపీ కమలాసన్ రెడ్డి ఆధ్వర్యంలో 200 మంది పోలీసులు వాహనాలను తనిఖీ చేయడంతోపాటు అన్ని ప్రాంతాలను జల్లెడపట్టారు.

ఓ వాహనాల దొంగతో పాటు, మరో నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సరైన పత్రాలు లేకపోవడంతో 43 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
 

మరిన్ని వార్తలు