కార్డన్ సెర్చ్.. 40 వాహనాలు స్వాధీనం

22 May, 2016 07:32 IST|Sakshi

హైదరాబాద్: మాదాపూర్, పంజగుట్ట పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసులు ఆదివారం వేకువజామున కార్డన్ సెర్చ్ నిర్వహించారు. మాదాపూర్ సిద్ధిక్‌నగర్‌లో డీసీపీ కార్తికేయ ఆధ్వర్యంలో 200 మంది పోలీసులు ఆదివారం ఈ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 34 ద్విచక్ర వాహనాలు, 5 ఆటోలు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లారెడ్డిగూడలోనూ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. హాస్టళ్లలో తనిఖీల సందర్భంగా 30 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు