హామీలన్నీ బుట్టదాఖలేనా!

26 Nov, 2016 01:42 IST|Sakshi
హామీలన్నీ బుట్టదాఖలేనా!
మాట తప్పినందుకు కేసీఆర్ ముక్కు నేలకు రాయాలి: తమ్మినేని
 సాక్షి, కౌడిపల్లి/హైదరాబాద్: ఎన్నికల హామీలను ముఖ్యమంత్రి కేసీఆర్ బుట్టదాఖలు చేశారని, మాట తప్పినందుకు ఆయన ముక్కు నేలకు రాయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. మహాజన పాదయాత్ర శుక్రవారం మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలో కొనసాగింది.   ఆయన మాట్లాడుతూ  దళితులకు మూడెకరాల సాగుభూమి, డబుల్ బెడ్‌రూం ఇళ్లు, ఎన్నికల హామీగానే మిగిలిపోయాయని విమర్శించారు. పాదయాత్ర కౌడిపల్లి మండల కేంద్రం సమీపంలో వెరుు్య కిలోమీటర్ల మైలురారుుని దాటింది. ఈ నెల 28న సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మెదక్ జిల్లా పొలంపల్లి నుంచి పాదయాత్రలో పాల్గొంటారు.  
 
మరిన్ని వార్తలు