క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా అరెస్ట్‌

17 May, 2017 11:33 IST|Sakshi
హైదరాబాద్‌: నగరంలోని కూకట్‌పల్లి పోలీసులు క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 1.50 లక్షల నగదుతో పాటు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం అర్ధరాత్రి ఐపీఎల్‌ మ్యాచ్‌ సందర్భంగా బెట్టింగ్‌ జరుగుతోందనే సమాచారంతో రంగంలోకి దిగిన ఎస్‌వోటీ పోలీసులు బెట్టింగ్‌ స్థావరం పై దాడి చేసి ముగ్గురు సభ్యుల బెట్టింగ్‌ ముఠాను అరెస్ట్‌ చేశారు. 
మరిన్ని వార్తలు