పరుగు పోటీలో కుప్పకూలిన అభ్యర్థి

1 May, 2016 04:06 IST|Sakshi
పరుగు పోటీలో కుప్పకూలిన అభ్యర్థి

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
హైదరాబాద్: దేహ దారుఢ్య పరీక్షల నిమిత్తం సీఆర్‌పీఎఫ్ నిర్వహించిన పరుగు పోటీలో పాల్గొన్న ఏఎస్సై అభ్యర్థి గుండెపోటుతో మృతిచెందారు. ఈ సంఘటన శనివారం బార్కాస్ సీఆర్‌పీఎఫ్ క్యాంపస్‌లో జరిగింది. ఒడిశా రాష్ట్రం రాంపూర్‌కు చెందిన  హిమాన్షు చంద్ర  జానా(29) ఏఎస్సై పోస్టుల భర్తీ కోసం సీఆర్‌పీఎఫ్‌లో నిర్వహిస్తున్న దేహదారుఢ్య పరీక్షల నిమిత్తం నగరానికి వచ్చారు.

చాంద్రాయణగుట్ట బార్కాస్ సీఆర్‌పీఎఫ్ క్యాంపస్‌లో ఉదయం 7 గంటలకు నిర్వహించిన 1,600 మీటర్ల పరుగు పందెంలో పాల్గొన్నారు. 800 మీటర్లకు చేరుకోగానే ఛాతీలో తీవ్రమైన నొప్పి రావడంతో కుప్పకూలిపోయారు. ఆయన్ను డీఆర్‌డీవో అపోలో ఆసుపత్రికి తరలించగా... అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందారు.

>
మరిన్ని వార్తలు