నగదు మార్పిడి ముఠా అరెస్టు

23 Dec, 2016 13:40 IST|Sakshi
హైదరాబాద్: కమీషన్‌పై నగదు మార్పిడికి పాల్పడుతున్న ముఠాను ఎల్బీనగర్ పోలీసులు పట్టుకున్నారు. నల్లగొండ జిల్లా హాలియాకు చెందిన భాను, వెంకటేశ్, నవీన్‌రెడ్డి అనే వారు శుక్రవారం ఉదయం ఎల్బీనగర్‌లో పాతనోట్లను కమీషన్‌పై తీసుకుని కొత్తనోట్ల మార్పిడి చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి వారిని పట్టుకున్నారు. వారి నుంచి రూ.19.70 లక్షల కొత్తనోట్లతోపాటు కారు, బైక్‌ను సీజ్ చేశారు. నిందితులను రిమాండ్‌కు పంపారు.
>
మరిన్ని వార్తలు