ఐటీ అధికారులమంటూ రాజేంద్రనగర్ లో దోపిడీ

9 Jul, 2013 11:10 IST|Sakshi

హైదరాబాద్ : హైదరాబాద్ నగర శివార్లలో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. రాజేంద్రనగర్లో ఇన్కం ట్యాక్ అధికారులమంటూ ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు అందినకాడికి దోచుకు వెళ్లారు. ఈరోజు మధ్యాహ్నం ముగ్గురు ముగ్గురు వ్యక్తులు స్థానికంగా నివాసం ఉంటున్న బసంతి అనే మహిళ ఇంటికి వెళ్లారు. తాము ఐటీ అధికారులమంటూ ఐడీ కార్డులు చూపించి ఇంట్లోకి ప్రవేశించారు. అనంతరం ఆమెను బెదిరించి ఆరు లక్షల నగదుతో పాటు, బంగారు ఆభరణాలను దోచుకు వెళ్లారు.

ఈ ఘటన నుంచి తేరుకున్నఆమె విషయాన్ని కుటుంబ సభ్యులతో పాటు స్థానికులకు తెలిపింది. అప్పటికే దుండగులు పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నారు. తెలిసినవారే ఈ చోరీకి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా గతంలో కూడా సరూర్నగర్ పరిధిలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో కూడా ఇదే తరహాలో చోరీ జరిగింది. దుండగులు 18 లక్షలు దోచుకుని ఉడాయించారు.
 

మరిన్ని వార్తలు