హైదరాబాద్: గోల్నాక వద్ద మూసీనదిలో గల్లంతైన తరుణ్ మృతదేహం సోమవారం ఉదయం లభ్యమైంది. మూసీ నదిలో తరుణ్(7) అనే బాలుడు ఆదివారం గల్లంతయ్యాడు. శంకర్ నగర్ బస్తీ మూసి నదికి పక్కనే ఉండటంతో అక్కడే తన ఇంటి వద్ద ఆడుకుంటూ వెళ్లిన తరుణ్ ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు. బంతికోసం వెళ్లిన బాలుడు దానిని తీసే క్రమంలో కాలు జారీ అందులో పడి కొట్టుకుపోయాడని అతడి తల్లి వాపోయింది. ఈ సందర్భంగా తల్లిదండ్రులు బంధువుల రోదనలు మిన్నంటాయి.