విద్యుదా ఘాతంతో ఉద్యోగి మృతి

17 Dec, 2015 15:52 IST|Sakshi

ట్రాన్స్ ఫార్మర్ మరమ్మతు చేస్తుండా ప్రమాద వశాత్తు ఒక విద్యుత్ ఉద్యోగి చనిపోయాడు. ఈ ఘనట హైదరాబాద్ నగరం కుత్బుల్లాపూర్ వాజ్ పేయి నగర్ లో గురువారం ఉదయం జరిగింది. స్థానికంగా కరెంటు లైన్లకు అడ్డుగా ఉన్న చెట్లను నరికే కార్యక్రమం జరుగుతోంది. ఈ క్రమంలో వాజ్ పేయి నగర్ లో ఒక విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ పైకి ఎక్కి గోపాల్(30) అనే ఉద్యోగి రిపేర్ చేస్తున్నాడు.

ఈ క్రమంలో బోల్టు ఒకటి చేతి నుంచి జారి పడింది. దీన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో విద్యుత్ ప్రసరిస్తున్న తీగలను తాకటంతో షాక్ కు గురై అక్కడి కక్కడే చనిపోయాడు. మృతుడిది మూసాపేట. కాగా.. అతడికి భార్య, ఒక కుమార్తె ఉన్నారు.

 

>
మరిన్ని వార్తలు