సాక్షి, హైదరాబాద్: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో (డీఎడ్) ప్రవేశాల కోసం శనివారం డీఈఈ సెట్–2017ను తొలిసారి ఆన్లైన్లో నిర్వహించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. 55 కేంద్రాల్లో నిర్వహించే ఈ పరీక్షకు 42,754 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. తెలుగుమీడియంలో 27,686మంది, ఉర్దూ మీడియం 2,914మంది, ఇంగ్లిష్ మీడియంకు 12,154 మంది దరఖాస్తు చేశారు.
ఏ మీడియంలో పరీక్ష రాసేవారు ఆ మీడియంలోనే డీఎడ్ చదవాలి. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు ఉర్దూ మీడియం వారికి, మధ్యాహ్నం 12.30 నుంచి 2.30 వరకు, సాయంత్రం 4 నుంచి 6 వరకు తెలుగు, ఇంగ్లిష్ మీడియం వారికి పరీక్షలుంటాయి. ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు. హాల్ టికెట్లో ఇచ్చిన పాస్వర్డ్ను ఉప యోగించి లాగిన్ కావాలి.