గుప్తనిధుల కోసం ఇల్లాలినే చంపారు

16 Dec, 2016 08:07 IST|Sakshi
గుప్తనిధుల కోసం ఇల్లాలినే చంపారు

హైదరాబాద్: గుప్త నిధులు దక్కుతాయనే మూఢనమ్మకం ఓ నిండుప్రాణాన్ని బలితీసుకుంది. కట్టుకున్నభర్త, కన్నకొడుకే ఈ దారుణానికి ఒడిగట్టారు. నగర నడిబొడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. రాజ్‌భవన్ ఎదురుగా ఉన్న ఎంఎస్‌మక్తాలో గురువారం అర్థరాత్రి అఫ్జల్ బేగం అనే మహిళను ఆమె భర్త, కొడుకు కలిసి గొంతుకోసి చంపారు.

గుప్త నిధుల కోసమే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు సమాచారం. నిందితులు పరారీలో ఉన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. పంజాగుట్ట పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తలు