దర్శకుడు ఆదిత్యకు అరుదైన అవకాశం

13 Sep, 2016 22:58 IST|Sakshi
ఆదిత్యకు ఉత్తర్వులు అందిస్తున్న కేంద్ర మంత్రి దత్తాత్రేయ

సనత్‌నగర్‌: యునైటెడ్‌ నేషన్స్ గుర్తింపు పొందిన సింగపూర్‌కు చెందిన గ్రాండ్‌ కింగ్‌డమ్‌ డైనస్టీ సర్కార్‌ (మహా సామ్రాజ్య వారసత్వం)కు దక్షిణ భారతదేశం తరఫున అంబాసిడర్‌గా సినీ దర్శకుడు పీసీ ఆదిత్య నియమితులయ్యారు. దీంతో పాటు అంతర్జాతీయ ప్రోటోకాల్‌ హోదాను కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఉత్తర్వు పత్రాలను పీసీ ఆదిత్యకు అందించారు. ఆదిత్య అంబాసిడర్‌గా నియమితులు కావడం తెలుగువాడికి దక్కిన అంతర్జాతీయ గుర్తింపుగా అభివర్ణించారు. ఈ అవకాశాన్ని కల్పించిన కేంద్రమంత్రి దత్తాత్రేయకు ఆదిత్య కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు