పోలీసులను ఆశ్రయించిన నితిన్‌ దర్శకుడు

7 Mar, 2017 17:42 IST|Sakshi
పోలీసులను ఆశ్రయించిన నితిన్‌ దర్శకుడు

హైదరాబాద్‌ : నితిన్‌ హీరోగా ‘గుండెజారి గల్లంతయిందే’  చిత్రానికి దర్శకత్వం వహించిన డైరెక్టర్‌  కొండా విజయ్‌ కుమార్‌ మంగళవారం ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీసులను ఆశ్రయించాడు. తన ప్రేమ పెళ్లి విషయంలో అతడు పోలీసుల ఆశ్రయం కోరినట్లు తెలుస్తోంది. కాగా  విజయ్‌ కుమార్‌ ఈ నెల 1వ తేదీన ప్రసూన అనే యువతిని వివాహం చేసుకున్నాడు. ఈ వివాహానికి విజయ్‌ కుటుంబంతో పాటు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.

చాలాకాలంగా విజయ్‌ ‌, ప్రసూన ప్రేమించుకున్నట్లు సమాచారం. అయితే ప్రసున కుటుంబసభ్యులకు ఈ వివాహం ఇష్టం లేనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అతడు పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.