సైనిక కుటుంబాలకు డబుల్‌ పెన్షన్‌

17 Jan, 2017 04:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మరణించిన సైనిక కుటుంబాలకు డబుల్‌ పెన్షన్‌ ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. ఈమేరకు ఆర్థిక శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగ విరమణ పొందిన సైనికులకు డబుల్‌ పెన్షన్‌ ఇప్పటికే అమల్లో ఉంది. కానీ, మరణించిన సైనికుల కుటుంబాలకు మాత్రం పెన్షన్‌గా కేవలం మిలిటరీ పెన్షన్‌ మాత్రమే చెల్లిస్తున్నారు. కొత్త ఉత్తర్వుల నేç పథ్యంలో మరణించిన సైనిక కుటుంబాలకు సైతం డబుల్‌ పెన్షన్‌ అందనుంది.
 

>
మరిన్ని వార్తలు