హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం గండిచెరువులో భారీ మొత్తంలో మాదక ద్రవ్యాలను నార్కోటిక్స్ ట్రోల్ బ్యూరో అధికారులు మంగళవారం సీజ్ చేశారు. ఈ డ్రగ్స్ గోడౌన్లో అక్రమంగా నిల్వ చేసినట్లు సమాచారం అందటంతో అధికారులు దాడులు నిర్వహించారు. డ్రగ్స్ సీజ్ చేసి, కేసు నమోదు చేశారు.