విమానాలు ఆలస్యం...ప్రయాణికుల ఆందోళన

4 Aug, 2016 11:33 IST|Sakshi

శంషాబాద్: శంషాబాద్ విమానాశ్రయం నుంచి దుబాయి వెళ్లాల్సిన విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. గురువారం ఉదయం దుబాయి వెళ్లాల్సిన ఎమిరేట్స్ సంస్థకు చెందిన మూడు విమానాలను సాంకేతిక కారణాలతో అధికారులు నిలిపివేశారు. తెల్లవారుజాము నుంచి పడిగాపులు కాస్తున్న ప్రయాణికులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు.

మరిన్ని వార్తలు