ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే ఎంసెట్ పరీక్షా కేంద్రాలు

29 Apr, 2016 10:37 IST|Sakshi

హైదరాబాద్ : ప్రైవేట్ విద్యాసంస్థలు నిరాకరించడంతోనే తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ పరీక్ష వాయిదా పడిందని ఆ పరీక్ష కన్వీనర్ రమణారావు వెల్లడించారు. శుక్రవారం హైదరాబాద్లో సాక్షి విలేకరితో ప్రత్యేకంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వంతో చర్చించి త్వరలోనే కొత్త షెడ్యూల్ ప్రకటిస్తామని తెలిపారు.

ఎంసెట్ పరీక్ష నిర్వహణ కోసం ఇంజినీరింగ్కు 1, 45, 000 మెడికల్కు 105,000 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే ఎంసెట్ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు