ప్రభుత్వ విద్యార్థులకు ఉచిత ఎంసెట్ శిక్షణ

1 Apr, 2016 03:10 IST|Sakshi
ప్రభుత్వ విద్యార్థులకు ఉచిత ఎంసెట్ శిక్షణ

సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియెట్ పూర్తి చేసి, ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఎంసెట్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఇంటర్ విద్య కమిషనర్ డాక్టర్ అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణ ఈ నెల 1 నుంచి 30 వరకు ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు 7లోగా తమ వెబ్‌సైట్‌లో (www.bietelan gana.cgg.gov.in) పేర్లు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

మరిన్ని వార్తలు