-

ప్రయాణికుడికి గుండెపోటు... విమానం అత్యవసర ల్యాండింగ్

18 Sep, 2014 09:29 IST|Sakshi
ప్రయాణికుడికి గుండెపోటు... విమానం అత్యవసర ల్యాండింగ్

హైదరాబాద్ : దుబాయి నుంచి సింగపూర్ వెళ్తున్న ఎమిరేట్స్ విమానం గురువారం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానంలోని ఓ ప్రయాణికుడికి అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. దీంతో సదరు ప్రయాణికుడు విమానంలోని సిబ్బందికి తెలియజేశాడు.

సిబ్బంది వెంటనే అప్రమత్తమైన శంషాబాద్ ఎయిర్పోర్టు అధికారులను సంప్రదించి ... ప్రయాణికుడి పరిస్థితిని వివరించారు.  ఎయిర్పోర్ట్ అధికారులు సానుకూలంగా స్పందించారు. దాంతో విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఎయిర్పోర్ట్లో అప్పటికే సిద్దంగా ఉన్న అంబులెన్స్లో ప్రయాణికుడిని హుటాహుటిన అపోలో ఆస్పత్రికి తరలించారు. అనంతరం విమానం సింగపూర్ బయలుదేరింది.
 

మరిన్ని వార్తలు