ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్ ఆత్మహత్య

12 Feb, 2017 12:47 IST|Sakshi

హైదరాబాద్‌: ఇంజినీరింగ్‌ పూర్తి చేసి ఉద్యోగవేటలో ఉన్న యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మౌలాలి ఎస్పీనగర్‌ కాలనీలో ఆదివారం వెలుగుచూసింది. స్థానికంగా నివాసముంటున్న వంశీకృష్ణ(22) ఇటీవలే బీటెక్‌ పూర్తిచేశాడు. ప్రస్తుతం ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా కుటుంబంలో కలహాలు రేగుతుండటంతో.. మనస్తాపానికి గురైన వంశీకృష్ణ ఉరి వేసుకుని బలవన్మరణం చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు