'ప్రభుత్వం కుంటిసాకులు చెబుతోంది'

30 Sep, 2015 22:05 IST|Sakshi
'ప్రభుత్వం కుంటిసాకులు చెబుతోంది'

హైదరాబాద్ : ఒకే దఫాలో రైతు రుణమాఫీపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు డిమండ్ చేశారు. రుణమాఫీకి కేంద్రం అప్పు ఇవ్వాలంటూ కుంటిసాకులు చెబుతున్నారంటూ టీఆర్ఎస్ నేతలపై విమర్శలు గుప్పించారు. కేంద్రాన్ని సంప్రదించే రుణమాఫీ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారా అని ప్రశ్నించారు.

ఇదిలాఉండగా.. రుణమాఫీపై స్పష్టమైన హామీ ఇచ్చినా విపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని టీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రైతులకు అర్థమైనా.. విపక్షాలకు మాత్రం అర్థం కావడం లేదంటూ ఆయన ఎద్దేవా చేశారు.

మరిన్ని వార్తలు