నా మాటలు వక్రీకరించారు: ఈటల

24 Jun, 2017 02:01 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణంపై తన మాటలను వక్రీకరించారని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. ఎలక్ట్రానిక్, ప్రింట్‌ మీడియాలో లేని వార్తను వెబ్‌సైట్‌లో రాశారని చెప్పారు.

శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ళ నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నాయని, వారిని ఆదర్శంగా తీసుకొని పనిచేయాలని చెబితే దాన్ని వక్రీకరించారన్నారు. దానిపై కొంతమంది నేతలు స్పందించడం అనైతికమన్నారు. ‘రాజకీయంగా కొట్లాడే దమ్ముంటే ఎదురుగా రండి కొట్లాడదాం.. కానీ అనని మాటలపై మాట్లాడటం సరికాదు. చౌకబారు రాజకీయాలు చేయొద్దు’ అని మంత్రి పేర్కొన్నారు.  
 

మరిన్ని వార్తలు