హైదరాబాద్‌లో భారీగా పేలుడు పదార్థాలు

27 May, 2017 16:17 IST|Sakshi
హైదరాబాద్‌: మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్గ నగర్ వద్ద పోలీసులు పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలను పట్టుకున్నారు. శంషాబాద్ ఎస్‌వోటీ పోలీసులు విశ్వసనీయ సమాచారం మేరకు తనిఖీలు చేపట్టారు. అటుగా వచ్చిన బొలెరోను తనిఖీ చేసి అందులో ఉన్న 2 వేల జిలెటిన్ స్టిక్స్, 2 వేల డిటోనెటర్స్ స్వాధీనం చేసుకున్నారు. వాహనంతో పాటు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసును మైలార్ దేవుపల్లి పోలీసులకు అప్పగించారు.            
మరిన్ని వార్తలు