అనుమతులు లేని వెంచర్లో అక్రమంగా డిటోనేటర్స్తో పేలుళ్లు జరుపుతుండటాన్ని గుర్తించిన ఎస్వోటీ పోలీసులు భారీగా చేసుకున్నారు. నగరంలోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చెంగిచర్లలో అనుమతి లేని వెంచర్లో అక్రమంగా పేలుళ్లు జరుపుంతుండటంతో.. గురువారం రాత్రి పోలీసులు దాడులు నిర్వహించారు. పేలుళ్లు నిర్విహ స్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 28 డిటోనేటర్స్, 50 కేజీల క్యాల్షియం హైడ్రాక్సైడ్ను స్వాధీనం చేసుకున్నారు.