విదేశాల్లో ఉద్యోగాలు పేరిట మోసం

6 Nov, 2014 18:15 IST|Sakshi

నగరంలోని కొత్తపేటలో ఉద్యోగాల పేరుతో ఓ కన్సెల్టెన్సీ ఘరానా మోసానికి పాల్పడింది. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నమ్మబలికి నిరుద్యోగులకు టోకరా వేసింది. టీఎంసీఎస్ అనే కన్సెల్టెన్సీ ఈ మోసానికి పాల్పడినట్టు తెలిసింది. ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డ నిరుద్యోగుల నుంచి లక్షల రూపాయలు వసూళ్లు చేసింది.

చివరికి తాము మోసపోయామని తెలుసుకున్నబాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

>
మరిన్ని వార్తలు