ఎమ్మెల్సీగా ఫరీదుద్దీన్ ఎన్నిక ఏకగ్రీవం

6 Oct, 2016 18:45 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ : శాసన మండలిలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్ధి మహ్మద్ ఫరీదుద్దీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా గురువారం నామినేషన్ల ఉపసంహరణల గడువు ముగిసింది. అయితే, ఈ పదవి కోసం ఒకే ఒక నామినేషన్ దాఖలు కావడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ కార్యదర్శి రాజసదారాం ఫరీదుద్దీన్‌కు ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లు ధ్రువీకరణ ప్రతం అందజేశారు.
 

>
మరిన్ని వార్తలు