ఫ్యాషన్ లైఫ్ స్టైల్

15 Oct, 2014 00:24 IST|Sakshi
ఫ్యాషన్ లైఫ్ స్టైల్

ట్రెండ్జ్ ఎగ్జిబిషన్ పాఠశాల మూవీ టీమ్ సందడి చేసింది. బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణలో మంగళవారం ప్రారంభమైన ఎక్స్‌పో తారల సందడికి వేదికగా నిలిచింది. హీరో నందు, హీరోయిన్ శిరీష, నటులు శశాంక్, హమూద్ ఎక్స్‌పో ఓపెనింగ్‌లో పాల్గొన్నారు. ఈ రోజుతో ముగియనున్న ఈ మేళాలో 110 మంది డిజైనర్లు రూపొందించిన జ్యుయలరీ వెరైటీలు ఫ్యాషన్ ప్రియులను కట్టిపడేస్తున్నాయి. డిజైనర్ వేర్, బ్రైడల్ జ్యుయలరీ, కాంటెంపరరీ ఆభరణాలు, యాక్సెరీస్, కిడ్స్ వేర్, లెహంగాస్, ట్రెడిషనల్ హ్యాండ్లూమ్స్ సిటీవాసులను అలరిస్తున్నాయి. దీపావళి ఫెస్ట్ కోసం ప్రత్యేకంగా పూజా సెట్స్ కూడా ఎక్స్‌పోలో అందుబాటులో ఉన్నాయి.
 
 

మరిన్ని వార్తలు