ఎస్ఆర్ నగర్ ఎస్బీఐలో ఘటన
హైదరాబాద్: ఎస్ఆర్ నగర్ ఎస్బీఐ కస్టమర్ వెయిటింగ్ హాల్లో ఆదివారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. బ్యాంక్ నుంచి భారీగా పొగలు రావడంతో పరిసర ప్రాంతాల్లోని ప్రజలు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. రాత్రి 11.30 గంటల ప్రాంతంలో ఎస్బీఐ నుంచి పొగలు రావడాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మూడు ఫైరింజన్లు రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి.
వెంటనే అప్రమత్తం కావడంతో భారీ నష్టం తప్పింది. సంఘటనా స్థలాన్ని డీఐజీ మురళీ కృష్ణ, ఏసీపీ వెంకటేశ్వర్లు సందర్శించారు. ప్రమాదానికి గల కారణాలు, ఆస్తినష్టం వివరాలు ఇప్పుడే చెప్పలేమని వారు తెలిపారు.