హైదరాబాద్; అమీర్పేటలో అగ్నిప్రమాదం

9 Dec, 2014 19:03 IST|Sakshi

హైదరాబాద్: హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న అమీర్పేటలో మంగళవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం జరిగింది. మైత్రీవనంలో సవేరా హోటల్లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగింది.

నిత్యం జనసమ్మర్థం ఉండే మైత్రీవనం ప్రాంతంలో అగ్నిప్రమాదం జరగడంతో జనం భయాందోళనకు గురయ్యారు. మైత్రీవనం వద్ద జనం భయంతో పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను ఆర్పివేశారు.

మరిన్ని వార్తలు