హైదరాబాద్ మైత్రివనంలో అగ్నిప్రమాదం

18 Oct, 2015 19:57 IST|Sakshi

హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న అమీర్ పేట సమీపంలోని మైత్రీ వనం పోస్టాఫీసులో అగ్నిప్రమాదం జరిగింది.  పోస్టాఫీస్‌లో ఉన్న ఫైల్స్ కాలి బూడిదయ్యాయి. ఆదివారం సాయంత్రం అగ్నిప్రమాదం సంభవించింది.

దీన్ని గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.  ప్రమాదానికి షార్ట్‌సర్క్యూట్ కారణమని అధికారులు భావిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు