ఫార్మా కంపెనీలో అగ్ని ప్రమాదం

16 Feb, 2015 13:56 IST|Sakshi
ఫార్మా కంపెనీలో అగ్ని ప్రమాదం

హైదరాబాద్: హైదరాబాద్ నగరం ఉప్పల్ ప్రాంతంలో దేవేంద్రనగర్ కాలనీలో ఉన్న కృష్ణా ఫార్మా కంపెనీలో సోమవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగింది. కంపెనీలో నిల్వ ఉన్న స్పిరిట్‌కు నిప్పు అంటుకుని పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు అగ్నమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

వెంటనే అక్కడికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది నాలుగు ఫైర్ ఇంజిన్‌లతో ప్రయత్నించినప్పటికీ మంటలు అదుపులోకి రాలేదు. పరిశ్రమలో ఉన్న సిలిండర్లకు మంటలు అంటుకునే అవకాశం ఉండటంతో స్థానికలు భయాందోళనలో ఉన్నారు. షార్ట్ సర్కూట్‌తోనే ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి ఇంకా వివరాలు తెలియ రావాల్సి ఉంది.

మరిన్ని వార్తలు