ఏపీ ఎంసెట్ ఫలితాల్లో తెలంగాణ విద్యార్థుల హవా

9 May, 2016 21:09 IST|Sakshi

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ ఇంజనీరింగ్ ఫలితాలలో తెలంగాణ విద్యార్థులు సత్తా చాటారు. టాప్ టెన్ ర్యాంకుల్లో నాలుగు తెలంగాణ విద్యార్థులకే దక్కాయి. రంగారెడ్డి జిల్లా నుంచి ముగ్గురు విద్యార్థులు టాప్టెన్లో చోటు దక్కించుకోగా.. మహబూబ్నగర్ జిల్లా నుంచి ఓ విద్యార్థి టాప్ టెన్‌లో నిలిచాడు.

టాప్టెన్లో నిలిచిన విద్యార్థులు వీరే..
మొదటి ర్యాంక్- వంశీకృష్ణారెడ్డి
రెండో ర్యాంక్- లక్ష్మీనారాయణ
మూడో ర్యాంక్- విఘ్నేష్ రెడ్డి
నాలుగో ర్యాంక్- ప్రశాంత్ రెడ్డి
ఐదో ర్యాంక్- గౌతమ్
ఆరో ర్యాంక్- చేతన్ సాయి
ఏడో ర్యాంక్- సాయితేజ
ఎనిమిదో ర్యాంక్- జార్జ్
తొమ్మిదో ర్యాంక్- సంజీవ్
పదో ర్యాంక్- జయకృష్ణసాయి

ఫలితాల్లో టాప్టెన్లో నిలిచిన వారంతా అబ్బాయిలే కావటం గమనార్హం. గతేడాదితో పోలిస్తే ఈసారి 10 శాతం ఉత్తీర్ణత తగ్గింది. నీట్ను తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్టు సోమవారం తీర్పు వెలువరించిన నేపథ్యంలో మెడికల్ ఫలితాలను నిలిపేస్తున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు.
 

మరిన్ని వార్తలు