దంపతులపై దాడి.. కేసు నమోదు

15 Apr, 2016 20:03 IST|Sakshi

ఇంటి ముందు నిల్చొని ఉన్న భార్య భర్తలపై నలుగురు యువకులు దాడి చేసిన సంఘటన నగరంలోని కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అరుణ్‌కాలనీలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న ఆదినారాయణ, ప్రమీలలు ఇంటి ముందు నిల్చొని ఉన్న సమయంలో అటుగా వచ్చిన నలుగురు యువకులు వారిపై దాడి చేశారు. దీంతో వారికి గాయాలవడంతో.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు దాడి చేసిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. దాడికి గల కారణాలు తెలియరాలేదు.
 

>
మరిన్ని వార్తలు