ఒంటరిగా ఉన్న మహిళ ఇంట్లోకి వెళ్లి..

21 Dec, 2015 09:07 IST|Sakshi

కుత్బుల్లాపూర్: ఒంటరిగా ఉన్న మహిళ ఇంట్లోకి ప్రవేశించిన యువకులు ఆమెను లైంగికంగా వేధించడంతో పాటు దౌర్జన్యం చేశారని ఫిర్యాదు అందడంతో నలుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ సంఘటన హైదరాబాద్లోని కుత్బుల్లాపూర్ భాగ్యలక్ష్మీకాలనీలో ఆదివారం చోటుచేసుకుంది.

స్థానిక కాలనీలో నివాసముంటున్న మహిళ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అదే ఇంటి పై అంతస్తులో అద్దెకు ఉండే నలుగురు యువకులు ఈ నెల 18న ఆమెతో అసభ్యంగా మాట్లాడటంతో పాటు ఇంటి లోపలికి వెళ్లి ఆమెను లైంగికంగా వేధించారు. దీంతో బాధితురాలి స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఆదివారం నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
 

మరిన్ని వార్తలు