'రాష్ట్ర బడ్జెట్లో సంక్షేమానికి పెద్ద పీట'

19 Mar, 2016 10:39 IST|Sakshi

హైదరాబాద్ : పేదల అభ్యున్నతికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆ పార్టీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ స్పష్టం చేశారు. శనివారం తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక బడ్జెట్పై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాదరి కిషోర్ మాట్లాడుతూ... రాష్ట్ర బడ్జెట్లో సంక్షేమానికి పెద్ద పీట వేసినట్లు తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ బంగారు తెలంగాణకు బాటలు వేసే విధంగా ఉందన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత ఆలోచనలతో ముందుకు సాగుతున్నారని గాదరి కిషోర్ పేర్కొన్నారు.  సాగునీటి రంగానికి కూడా ఈ బడ్జెట్లో అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు గాదరి కిషోర్ గుర్తు చేశారు.

మరిన్ని వార్తలు