రజినీ, పవన్‌తో కలసి పనిచేస్తాం

29 Jun, 2017 21:42 IST|Sakshi
రజినీ, పవన్‌తో కలసి పనిచేస్తాం

ప్రజా గాయకుడు గద్దర్‌
సాక్షి, హైదరాబాద్‌: సౌత్‌ ఇండియన్‌ కల్చరల్‌ అసోసియేషన్‌ (సికా) ఆధ్వర్యంలో దక్షిణాది రాష్ట్రాల సాంస్కృతిక, సామాజిక, రాజకీయ ఉద్యమాన్ని నిర్మిస్తామని ప్రజాగాయకుడు గద్దర్‌ చెప్పారు. గురువారం హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. సినీనటుడు రజినీకాంత్, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌తో కలసి పనిచేయాలని భావిస్తున్నామని చెప్పారు. తమ తరపున ప్రతినిధులు వెళ్లి విధి విధానాలను వివరించారని, రజినీకాంత్, పవన్‌ అంగీకారం కోసం ఎదురుచూస్తున్నామని ఆయన తెలిపారు.

200 పార్లమెంట్‌ స్థానాల్లో సాంస్కృతిక ఉద్యమాన్ని నిర్మిస్తామని స్పష్టం చేశారు. ఢిల్లీలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఘాట్‌ ఏర్పాటుకు స్థలం ఇవ్వకపోవడం వివక్ష కాదా అని ప్రశ్నించారు. దక్షిణాది ఆత్మగౌరవ జెండా రెపరెపలు చూడాలనే.. సికా ఉద్యమంలోకి పవన్, రజినీకాంత్‌ను ఆహ్వానించామని గద్దర్‌ పేర్కొన్నారు. పాడేరు ఏజన్సీలో కరపత్రాలు పోలీసుల పనేనని ఆయన ఆరోపించారు.

మరిన్ని వార్తలు