గాంధీలో నిలిచిన పోస్ట్ మార్టంలు

19 May, 2015 12:55 IST|Sakshi

హైదరాబాద్: గాంధీ ఆసుపత్రి ఆర్ఎంవో నరహరిపై చర్యలు తీసుకోవాలని ఆ ఆసుపత్రి మార్చురీ వైద్యులు మంగళవారం ప్రభుత్వ ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు. నరహరి వైఖరికి నిరసనగా విధులు బహిష్కరిస్తున్నట్లు వారు ప్రకటించారు. అనంతరం ఆసుపత్రిలో వారు ఆందోళనకు దిగారు.

దాంతో మార్చురీలో పోస్టుమార్టంలు నిలిచిపోయాయి. ఈ అంశంపై చర్చకు రావాలని గాంధీ ఆసుపత్ర సూపరింటెండెంట్... మార్చురీ వైద్యులకు సమాచారం అందించారు. దీంతో సూపరింటెండెంట్తో మార్చురీ వైద్యులు చర్చలు జరుపుతున్నారు.

మరిన్ని వార్తలు