హైదరాబాద్: కూకట్పల్లి కేపీహెచ్బీ కాలనీలోని జీహెచ్ఎంసీ వార్డ్ ఆఫీస్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. కాంట్రాక్ట్ కార్మికుడిగా పని చేస్తున్న బలేశ్వర్ గురువారం రాత్రి బలవన్మరణానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.