కరెంట్ షాక్‌తో జీహెచ్‌ఎంసీ కార్మికురాలు మృతి

11 Sep, 2016 09:27 IST|Sakshi

హైదరాబాద్: విధులు నిర్వర్తిస్తున్న జీహెచ్‌ఎంసీ కార్మికురాలు విద్యుదాఘాతానికి గురై మృతిచెందింది. ఈ సంఘటన నగరంలోని బంజారాహిల్స్ జీవీకే మాల్ వద్ద ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. ఎస్‌బీటీ నగర్‌కు చెందిన హైమావతి జీహెచ్‌ఎంసీలో పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తోంది.

ఈ క్రమంలో నేటి ఉదయం జీవీకే మాల్ సమీపంలో రోడ్లు శుభ్రం చేస్తుండగా.. ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతానికి గురై మృతిచెందింది. విషయం తెలుసుకున్న జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్ రవికిరణ్ అక్కడికి చేరుకుని ఘటనకు గల కారణాలను ఆరా తీస్తున్నారు. మృతురాలి కుటుంబానికి రూ. 5 లక్షల సాయం ప్రకటించారు.

మరిన్ని వార్తలు