పాతబస్తీలో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్!

16 Feb, 2017 06:51 IST|Sakshi

హైదరాబాద్: నగరంలోని పాతబస్తీ మొఘల్ ఫురా పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మానసిక స్థితి సరిగా లేదని భావిస్తున్న ఓ బాలికపై ఏడుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వారి నుంచి తప్పించుకున్న బాలిక స్థానికుల సహాయంతో పోలీసులకు బుధవారం అర్ధరాత్రి సమయంలో ఫిర్యాదు చేసింది. ప్రధాన నిందితులు అజయ్, కరణ్ లను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. బాలికను గ్యాంగ్ రేప్ చేసిన నిందితులపై అత్యాచారం, నిర్భయ, కిడ్నాప్ కేసులు నమోదు చేసినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు