16వ అంతస్తు నుంచి పడి.. యువతి...

27 Jul, 2016 12:26 IST|Sakshi
16వ అంతస్తు నుంచి పడి.. యువతి...

హైదరాబాద్‌ : మాదాపూర్‌లోని మీనాక్షి స్కైలాంజ్ అపార్ట్‌మెంట్ 16వ అంతస్తుపై నుంచి పడి వెన్నెల (19) అనే యువతి మరణించింది. బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. వాచ్మెన్ సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలికి చేరుకున్నారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని... పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువతిది ఆత్మహత్యా ? లేక హత్య ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతురాలు వెన్నెల స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం గునుపూడి అని పోలీసులు తెలిపారు.

>
మరిన్ని వార్తలు