కేసులో ఇంప్లీడ్ అవుతాం: చాడ

6 Aug, 2016 01:59 IST|Sakshi
కేసులో ఇంప్లీడ్ అవుతాం: చాడ

సాక్షి, హైదరాబాద్: జీవో 123ని హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలని శుక్రవారం సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వం చేసిన అప్పీలుకు సంబంధించిన కేసులో సీపీఐ కూడా ఇంప్లీడ్ అవుతుందని తెలిపారు. జీవో 123ని కోర్టు కొట్టేసినా దానిపై అప్పీలుకు వెళ్లడం ప్రభుత్వ మొండివైఖరికి నిదర్శనమని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వానికి పట్టు విడుపులుండాలని సూచించారు.

మరిన్ని వార్తలు