బోనమెత్తిన నగరి

20 Jul, 2015 00:20 IST|Sakshi
బోనమెత్తిన నగరి

ఆధ్యాత్మిక ఝరి.. భక్త జనసిరి..
తెలంగాణ సంప్రదాయ ఉత్సవం బోనాలు ఆదివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవ ఊరేగింపుతో చారిత్రక గోల్కొండ కోట పులకించింది. కోటకు దారితీసే అన్ని మార్గాల్లో భక్తులు బారులు తీరి జగదాంబికకు మొక్కులు చెల్లించుకున్నారు. నెత్తిన బోనాలతో మహిళలు.. పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, తొట్టెల ఊరేగింపుతో గోల్కొండ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. విద్యుద్దీపాల కాంతుల్లో కోట దేదీప్యమానంగా వెలుగులీనింది. ఈ సారి ఉత్సవాల తొలిరోజే అమ్మవారి భారీ విగ్రహాల ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.    
  - లంగర్‌హౌస్/గోల్కొండ

మరిన్ని వార్తలు