గవర్నర్ సంక్రాంతి శుభాకాంక్షలు

15 Jan, 2016 05:07 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ హార్థిక శుభాకాంక్షలు తెలిపారు. పంట కోతల పండుగగా అత్యంత ఉల్లాసంగా, సంతోషంగా ఈ పర్వదినాన్ని జరుపుకోవడం మన సంస్కృతిలో భాగంగా మారిందన్నారు. రైతులకు మేలు జరగాలని, ప్రేమ, అనురాగం, స్నేహబంధం, సోదర భావానికి ఈ పండుగ స్ఫూర్తిదాయకంగా మారాలని ఆయన ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు