హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికలపై హైకోర్టు సోమవారం తుదితీర్పునిచ్చింది. డిసెంబర్ 15లోపు ఎన్నికలు జరిపించాలని న్యాయస్థానం ...ప్రభుత్వాన్ని ఆదేశించింది. అక్టోబర్ 31లోగా వార్డుల విభజన పూర్తి చేయాలని సూచించింది. కాగా జీహెచ్ఎంసీ ఎన్నికలను పదేపదే జాప్యం చేయడంపై హైకోర్టు సీరియస్ అయిన విషయం తెలిసిందే. ఎన్నికలు మీరు నిర్వహిస్తారా, లేదా మమ్మల్ని జోక్యం చేసుకొమ్మంటారా అని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. పలుమార్లు వాయిదా అనంతరం గ్రేటర్ ఎన్నికలపై హైకోర్టు ఇవాళ తుదితీర్పును వెల్లడించింది.