లోక్సభ నియోజకవర్గాలను జిల్లాలుగా చేయండి!

14 Nov, 2015 13:17 IST|Sakshi
లోక్సభ నియోజకవర్గాలను జిల్లాలుగా చేయండి!

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో కొత్త జిల్లాల ఏర్పాటు సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. శనివారం ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకు గుత్తా సుఖేందర్రెడ్డి లేఖ రాశారు. ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు చేయాల్సిందే అని నిర్ణయం తీసుకుంటే.. మాత్రం 17 లోక్సభ నియోజకవర్గాలను జిల్లాలుగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ అంశాన్ని పరిశీలించాలని ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకు గుత్తా సుఖేందర్రెడ్డి విజ్ఞప్తి చేశారు.

>
మరిన్ని వార్తలు