‘దళితులపై దాడులను పట్టించుకోని సీఎం’

13 Aug, 2016 20:26 IST|Sakshi

హైదరాబాద్‌: దళితులపై దాడులు జరుగుతున్నా వాటిని నిరోధించేందుకు సీఎం చంద్రబాబు చర్యలు తీసుకోవడం లేదని గిరిజన విద్యార్థి సమాఖ్య (జీవీఎస్) నేత వడిత్యా శంకర్ నాయక్ శనివారం ఒక ప్రకటనలో ఆరోపించారు.

అమలాపురం లాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని శంకర్ నాయక్ డిమాండ్ చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో ఆవు చర్మాన్ని తొలగిస్తున్న దళితులపై అత్యంత దారుణంగా దాడి చేయడం నీచమైన చర్య అన్నారు. ప్రభుత్వం ఇలాంటి సంఘటనలను తీవ్రంగా పరిగణించాలని ఆయన కోరారు.

మరిన్ని వార్తలు