-
హైదరాబాద్ : హైదరాబాద్లో సెక్షన్ 8 అమలు చేయాలంటూ దాఖలపై పిటిషన్ను హైకోర్టు సోమవారం కొట్టేసింది. అంతేకాకుండా పిటిషన్లో విచారణకు అర్హమైన అంశాలు లేవంటూ పిటిషనర్పై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. సెక్షన్ 8 అమలు చేయాలంటూ సీమాంధ్ర గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే కేసు విచారణ జరపాలంటే నగదు డిపాజిట్ చేయాలని కోర్టు సూచించింది. దాంతో కేసు వెనక్కి తీసుకుంటానని పిటిషనర్ న్యాయస్థానానికి తెలపడంతో... విలువైన సమయం వృధా చేశారంటూ పిటిషనర్పై కోర్టు సీరియస్ అయింది.