మండుతున్న ఎండలు

21 Mar, 2016 16:28 IST|Sakshi

హైదరాబాద్ : వేసవి కాలం పూర్తిగా రాక ముందే భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో గత రెండు రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. సోమవారం భాస్కరుడి ప్రతాపానికి మహబూబ్‌నగర్, అనంతపురం, కర్నూలు, నంద్యాలలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా.. నందిగామ, తునిలో 41 డిగ్రీలు, తిరుపతి, కడపలో 40 డిగ్రీలుగా నమోదయ్యాయి. ఇంటి నుంచి బయటకు రావాలంటేనే జనం భయపడుతున్నారు. ఉదయం నుంచే ఎండ తీవ్ర త ఎక్కువగా ఉండటంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు.

మరిన్ని వార్తలు