ఉస్మానియా మెడికల్ కాలేజీ వద్ద ఉద్రిక్తత

23 Oct, 2014 10:53 IST|Sakshi
ఉస్మానియా మెడికల్ కాలేజీ వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్: కోఠిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీ వద్ద గురువారం తెల్లవారుజామున ఉద్రిక్తత నెలకొంది. జూడాలు దీక్షా శిబిరాన్ని పోలీసులు తొలగించారు. దీంతో పోలీసుల ప్రయత్నాన్ని జూడాలు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో జూడాలు, పోలీసుల మధ్య తీవ్ర తొపులాట చోటు చేసుకుంది. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఈ 50 మంది జూడాలను పోలీసులు అదుపులోకి తీసుకుని సుల్తాన్ బజార్ పోలీసు స్టేషన్కు తరలించారు. జూడాలు గ్రామీణ ప్రాంతంలో విధులు నిర్వర్తించాలని తెలంగాణ ప్రభుత్వం జీవో 107ను జారీ చేసింది. ఆ జీవోను నిరసిస్తూ జూడాలు గత 25 రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు